‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) నాయకుడు, ప్రముఖ సినీనటుడు విజయ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 13 నుంచి రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు విజయ్ పర్యటనకు భద్రత కల్పించాలని కోరుతూ టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఆ వినతిపత్రంలో విజయ్ పర్యటించనున్న నియోజకవర్గాల వివరాలను పొందుపరిచారు.
ఈ నెల 13న తన మొదటి విడత పర్యటనకు తిరుచ్చి సమీపంలోని శ్రీరంగం నుంచి విజయ్ శ్రీకారం చుట్టనున్నారు.

