ప్రస్తుతం రష్యాలో పర్యటిస్తున్న భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ గురువారం మాస్కోలోని క్రెమ్లిన్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో కీలక అంశాలపై జైశంకర్ పుతిన్తో చర్చించారు.
రాబోయే రోజుల్లో రెండు దేశాల మధ్య జరగనున్న వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ఏర్పాట్లు, అంతర్జాతీయ పరిణామాలు, ఉక్రెయిన్లోని తాజా పరిస్థితులపై ఈ భేటీలో చర్చించినట్లు జైశంకర్ తెలిపారు.

