చమురు ఉత్పత్తి దేశాల కూటమి ది ఆర్గనైజేషన్ ఆఫ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ కంట్రీస్ ( OPEC ), ఒపెక్ ప్లస్ నుంచి వైదొలగుతున్నట్టు యూఏఈ మంగళవారం ప్రకటించింది. ఇది మే 1 నుంచి అమల్లోకి వస్తుందని ఆ దేశం తెలిపింది. ఒపెక్, దానిని నడిపించే సౌదీ అరేబియాకు ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బ. చమురు ధరలను పెంచి ప్రపంచాన్ని ఒపెక్ దోచుకుంటోందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఈ కూటమిలో గందరగోళాన్ని సృష్టించి, బలహీనపరిచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

