మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర మొత్తం 828 హుండీలలో 615 హుండీల లెక్కింపు పూర్తి అయింది. ఇప్పటివరకు రూ. 10 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. తొలి రోజు 125 హుండీలను తెరవగా రూ. 2,49,65,000 ఆదాయం వచ్చింది. రెండో రోజు 160 హుండీలను తెరవగా రూ. 3,54,25,200 ఆదాయం వచ్చినట్టుగా లెక్కించారు. మూడో రోజైన శనివారం 140 హుండీలు తెరవగా.. రూ.2,01, 21, 440 ఆదాయం లభించింది. 4వ రోజైన ఆదివారం నాడు 200 హుండీలను లెక్కించగా… రూ. 2,64,75,757 ఆదాయం లభించింది.

