రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ స్మృతి మంధాన తన బ్యాటింగ్తో ప్రకంపనలు సృష్టించింది. వడోదరలో జరిగిన చరిత్రాత్మక ఫైనల్ లో సూపర్ బ్యాటింగ్ తో ఆర్సీబీని ఛాంపియన్ గా నిలబెట్టింది. ఫైనల్ తర్వాత స్మృతి మంధాన 377 పరుగులతో ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచింది.ఇందులో ఒక ఇన్నింగ్స్లో ఆమె చేసిన 96 పరుగులు అత్యధికం. కేవలం 4 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినప్పటికీ, డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఒక భారతీయ క్రీడాకారిణి సాధించిన అత్యధిక స్కోరుగా ఇది నమోదైంది.

