మాజీ మంత్రి రోజా కూడా నగరిలో జరిగే వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, వైసీపీ నేతలతో కలిసి ఆమె సంబరాలు జరుపుకున్నారు. అధిష్ఠానం పిలుపు మేరకు మెడికల్ కాలేజీ జీవోలను భోగిమంటల్లో వేసి దహనం చేశారు. రాష్ట్రంలో నిజమైన సంక్రాంతి వైసీపీ పాలనలోనే ఉందని ఇప్పుడు కేవలం చంద్రబాబు ప్యామిలీకే సంక్రాంతి ఉందని విమర్శించారు. ఏ వర్గం కూడా సంతోషంగా లేరని, ముఖ్యంగా రైతుల పరిస్థితి దారుణంగా ఉందని అభిప్రాయపడ్డారు.

