ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా భారత్–Israel మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. కృత్రిమ మేధ (AI), వ్యవసాయం, రక్షణ, సాంకేతికత రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచేందుకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు కూడా తుది దశకు చేరుకున్నాయి. మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా క్షిపణులు, డ్రోన్ల సాంకేతికత బదిలీపై అవగాహన కుదిరింది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ రంగాల్లో సంయుక్త పరిశోధనలకు ఒప్పందం కుదిరింది.

