టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఊహించని షాకిచ్చారు. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్ కేసులో భాగంగా ఈడీ అధికారులు ఆయనను విచారించారు. హైదరాబాద్లో మూడు గంటల పాటు విచారణ జరిగింది. దీంతో ఈ ఇష్యూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. 2018-19లో రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్లో పలువురు ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అల్లు అరవింద్ పేరు కూడా ఇందులో ఉంది.

