
తనమీద సహచర మంత్రులు ఎవరూ ఫిర్యాదు చేశారని నమ్మడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తాను అంటే ఏంటో అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. రూ.70 కోట్ల కాంట్రాక్టు కోసం తాపత్రయ పడే అంత అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. మంత్రులు తనమీద ఫిర్యాదు చేయడానికి అసలు ఏమి ఉందని ప్రశ్నించారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఇద్దరు మంత్రులు సమ్మక్క – సారక్కలాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.