తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు తిరిగేలా శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తూ రాష్ట్ర రాజకీయ వేదికపై కొత్త చర్చకు తెరలేపారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో నిర్వహించిన భారీ ఆవిర్భావ సభలో ఆమె తన పార్టీ పేరును “తెలంగాణ రాష్ట్ర సేన”గా వెల్లడించారు. సంక్షిప్తంగా టీఆర్ఎస్ (TRS) అని ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా ఆసక్తికర వాతావరణం నెలకొంది. కొత్త పార్టీ పేరులో “TRS” అనే పదం ఉండటం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

