ప్రజా సేవ పట్ల అంకితభావం కనబరిచిన సివిల్ సర్వెంట్లను గౌరవించడానికీ, పరిపాలనలో శ్రేష్ఠతను ప్రోత్సహించడానికీ భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21న జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మొదటి హోం మంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 1947లో చేసిన ప్రసంగంలో సివిల్ సర్వెంట్లను “భారతదేశపు ఉక్కు చట్రం”గా అభివర్ణించారు. ఆ ప్రసంగాన్ని స్మరించుకుంటూ ఈ రోజును జరుపుకుంటారు.

