యూరప్ దేశం నార్వే లోని యూఎస్ ఎంబసీ వద్ద పేలుడు సంభవించింది. ఈ క్రమంలో భారీ శబ్దం వినిపించిందని, పెద్దఎత్తున పొగ వ్యాపించిందని పోలీసులు పేర్కొన్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన జరిగిందని అన్నారు. ఓస్లో నగరంలోని యూఎస్ ఎంబసీ ప్రవేశ ద్వారం వద్ద ఈ పేలుడు సంభవించిందని చెప్పారు. ఈ పేలుడువల్ల స్వల్ప నష్టం వాటిల్లినట్లు తెలిపారు. అయితే ఎవరూ గాయపడలేదని స్పష్టంచేశారు. ఈ పేలుడుకుగల కారణాలు తెలియరాలేదన్నారు.

