పంతొమ్మిదో సీజన్లో ముంబై ఇండియన్స్ రెండో విజయంతో మురిసింది. వరసగా నాలుగు ఓటములనుంచి తేరుకున్న ముంబైకి తిలక్ వర్మ(101 నాటౌట్) సునామీ సెంచరీతో భారీ స్కోరందించగా.. బంతితో అశ్వనీ కుమార్(4-24) గుజరాత్ టైటన్స్ మిడిలార్డర్ను కూల్చాడు. ఈ సీజన్లో తొలి వికెట్తో బుమ్రా(1-15) గుజరాత్ పతనాన్ని మొదలెట్టగా కుర్రాడు అశ్వన్ వికెట్ల వేటతో ముంబైని గెలిపించాడు. 200 పరుగుల ఛేదనలో పరిమితమైన గుజరాత్కు సొంత ప్రేక్షకుల సమక్షంలో భారీ ఓటమి చవిచూసింది.

