డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి గురైన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్యపై ఎట్టకేలకు బదిలీ వేటు పడింది. భీమవరం నియోజకవర్గంలో పేకాట క్లబ్బుల నిర్వహణకు ఆయన పరోక్షంగా సహకరిస్తున్నారని.. నిర్వాహకుల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. జనసేన నేతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ జయసూర్యను బదిలీ చేస్తూ ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.

