ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి 6267 ఓట్ల మెజార్టీతో గెలిచారు. టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డికి 12708 ఓట్లు రాగా.. వైఎస్సార్సీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి 6513 ఓట్లు వచ్చాయి.. మిగిలిన ఓట్లు స్వతంత్ర అభ్యర్థులకు వచ్చాయి. టీడీపీ అభ్యర్థికి 6267 ఓట్ల మెజార్టీ వచ్చిందని ప్రకటించారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ గెలవడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు.

