అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన విధానాలపై మాట్లాడారు. టారిఫ్ల విధానం వల్లే అమెరికాలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. అలాగే వెనిజువేలా అధ్యక్షుడు నికోలాస్ మదురో ప్రభుత్వంపై ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. మరోవైపు చికాగో, లాస్ ఏంజెలెస్, పోర్ట్లాండ్ నగరాల నుంచి నేషనల్ గార్డ్ను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మూడు కీలక పరిణామాలు అమెరికా రాజకీయాల్లో, అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి.

