కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ జన నాయగన్ మూవీ టీమ్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సెన్సార్ సర్టిఫికెట్ జారీకి స్టే విధించిన మద్రాస్ హైకోర్టు ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ సినిమా నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ ఆ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించాలని ఆదేశించింది. ఈనెల 20న విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్కు సుప్రీంకోర్టు గురువారం నాడు సూచించింది.

