ఖమ్మం జిల్లా, చింతకాని మండలం పాతర్లపాడు, రేపల్లె వాడల మధ్య మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన, మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. సుమారు 800 క్వింటాళ్ల మొక్క జొన్న బస్తాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. రైతులు మంటలు ఆర్పే లోపే పంటంతా బూడిద అవ్వడంతో రూ.20 లక్షల రూపాయల పంట నష్టం జరిగింది. ఈ ఘటనపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా గుర్తు తెలియని వ్యక్తులు పంటకు నిప్పంటించినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

