ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజీ కూడా నిర్మించలేదని వైసిపి నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత హోంమంత్రి అనిత, సవితకు లేదని ధ్వజమెత్తారు.
కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం ఎలా అనే మందును మంత్రులకు చంద్రబాబు ఇస్తున్నారని మండిపడ్డారు. రాజమండ్రి, విజయ నగరం, మచిలీపట్నం, నంద్యాల, పాడేరు మెడికల్ కాలేజీల పరిశీలించడానికి వస్తావా హోంమంత్రి అంటూ ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలు ఎలా ఉంటాయో, విద్యార్థులు ఎలా ఉంటారో చూపిస్తానని రోజా సవాల్ విసిరారు.

