అరెస్ట్ చేసిన గ్యాంగ్స్టర్కు పోలీసులు గుండు కొట్టించారు. అతడి మీసాలు తీయించారు. ఆ తర్వాత బహిరంగంగా ఊరేగించారు. దీంతో గ్యాంగ్స్టర్ భార్య హై కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేసి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్ను కోర్టు ఆదేశించింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఈ సంఘటన జరిగింది.గ్యాంగ్స్టర్ జుబైర్ మౌలానాపై హత్యాయత్నం, దాడి, కిడ్నాప్, ఆత్మహత్యకు ప్రేరేపించడం, పోలీస్ బృందంపై దాడి వంటి 50కు పైగా కేసులు పలు పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి

