కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సంస్కరణలకు వ్యతిరేకమని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఆ పార్టీ చేసేవన్నీ ప్రతికూల రాజకీయాలని మండిపడ్డారు. ‘‘జన్ధన్, డిజిటల్ పేమెంట్స్, జీఎస్టీ, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దులను కూడా కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఏ సంస్కరణ వచ్చినా ఆ పార్టీ అడ్డుకుంటుంది.. దుష్ప్రచారం చేస్తుంది. ప్రజలను తప్పుదోవ పట్టించడం వారికి వెన్నతో పెట్టిన విద్య. హస్తం పార్టీ విధానాల వల్ల దేశానికి తీవ్ర నష్టం జరుగుతోంది’’ అని అన్నారు.

