ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేదుకు కేంద్రం ప్రయత్నిస్తోందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉపాధి హామీ పథకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని బిజెపి రద్దు చేయబోతుందని, అధికారం ఉంది కదా అని ప్రధాని నరేంద్రమోడీ సర్కార్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించేవరకు పోరాటం చేస్తామని సిఎం పేర్కొన్నారు.

