తమ సమస్యల పరిష్కారానికి రేపటి నుంచి సమ్మె చేపడుతున్నామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. తాము తలపెట్టిన సమ్మెకు అన్ని ఆర్టీసీ సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయని పేర్కొన్నారు. సమ్మె నోటీసులు ఇచ్చి 41 రోజులు అవుతున్నా.. ఇప్పటికీ ప్రభుత్వం, యాజమాన్యం చర్చలు జరపకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వం తమను చర్చలకు పిలవలేదని తెలిపారు. కనీసం సమ్మె నివారణ చర్యలు కూడా చేపట్టలేదని పేర్కొన్నారు.

