భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన సానియాను అర్జున్ వివాహం చేసుకోబోతున్నాడు. మరికొద్ది రోజుల్లో వీరి వివాహం జరగనుంది. ఈక్రమంలో సచిన్ టెండూల్కర్ తన కుటుంబంతో కలిసి మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి.. అర్జున్-సానియా వివాహానికి ఆహ్వానించారు. ప్రధాని మోడీతో దిగిన ఫోటోలను సచిన్.. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఖాతాల్లో షేర్ చేశారు.

