నగరంలో నిత్యం లక్షల మందిని గమ్య స్థానాలకు చేర్చే మెట్రో రైల్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. నాగోల్-రాయదుర్గం మార్గంలో సాంకేతిక లోపం కారణంగా మెట్రో సేవలకు అవాంతరం కలుగుతోంది.సాంకేతిక సమస్యవల్ల నాగోల్-రాయదుర్గం మార్గంలో మెట్రో సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని మెట్రో నిర్వాహకులు తెలిపినట్లు సమాచారం. వివిధ పనుల నిమిత్తం వేగం వెళ్లవచ్చనే ఉద్దేశంతో మెట్రోను ఆశ్రయించిన ప్రయాణికులు అంతరాయంవల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

