
సైప్రస్లో పర్యటించిన ప్రధాని మోదీ ఆ దేశ ప్రెసిడెంట్ సతీమణి, ఫస్ట్ లేడీ ఫిలిప్పా కార్సెరాకు సిల్వర్ క్లచ్ పర్స్ బహుకరించారు. ఇది ఏపీలో తయారు చేసింది కావడం విశేషం. భారతదేశ గొప్ప హస్తకళను ప్రతిబింబించేలా.. దీన్ని భారత సంప్రదాయ కళతో మోడర్న్ స్టైల్ ఉట్టిపడేలా రూపొందించారు. టెంపుల్, రాయర్ ఆర్ట్ను ప్రతిబింబించారు. మధ్యలో అమర్చిన విలువైన రాయి మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. మరోవైపు ప్రెసిడెంట్ నికోస్కు కశ్మీర్ సిల్క్ కార్పెట్ను గిఫ్ట్గా ఇచ్చారు.