తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పలువురు ఐపీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ కేడర్లోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శిఖా గోయెల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర వంటి ఐపీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ కేడర్లో ఎందుకు కొనసాగిస్తున్నారో వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26వ తేదీన విడుదల చేసిన జీవో 1342 ప్రకారం పలువురు ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించిందని వడ్ల శ్రీకాంత్ హైకోర్టును ఆశ్రయించారు.

