‘ది కేరళ స్టోరీ 2’ చుట్టూ జరుగుతున్న వివాదంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక కామెంట్స్ చేశారు. ‘ది కేరళ స్టోరీ 2’ ప్రదర్శింపబడుతున్న థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయని, ఆ సినిమాను ఎవరూ చూడటం లేదన్నారు. సినిమాలను, మీడియాను కొందరు రాజకీయ ప్రచార సాధనాలుగా మార్చేశారని, తద్వారా సమాజంలో విభజన తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. కేరళలోని ఇడుక్కిలో మరియన్ కాలేజీ విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆ వీడియోను రాహుల్ గాంధీ తన సోషల్ మీ షేర్ చేశారు.

