సంగారెడ్డి పట్టణంలోని కల్వకుంట రోడ్డు శాంతినగర్ లో, అక్రమంగా నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్స్ పేలి నిర్వాహకులకు.. కుటుంబ సభ్యులతో సహా తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ బాధితులను ఆస్పత్రికి తరలించారు.. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో సంగమేశ్, మల్లమ్మ, బిందు, చిన్న లకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే , వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

