
డైనమిక్ సిటీ విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ను లాంఛ్ చేయడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. అన్ని కోణాల నుంచి వచ్చిన ఈ పెట్టుబడిలో గెగావాట్ – స్కేల్ డేటా సెంటర్ల రూపంలో మౌలిక సదుపాయాలు
వికసిత్ భారత్కి దోహదం చేస్తాయని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. సాంకేతికతను ప్రజలందరికీ అందుబాటులోకి తేవడంలో విశాఖపట్నంలోని గూగుల్ ఏఐ హబ్ చాలా శక్తివంతంగా పనిచేస్తోందని అభివర్ణించారు.