
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో విషాదం నెలకొంది. వినాయకచవితి సమీపిస్తున్నందున బాలాజీ వినాయక విగ్రహాల తయారి కేంద్రంలో భారీ గణపతి విగ్రహాన్ని తయారు చేశారు. 13 అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని ఒకచోటి నుంచి మరో చోటికి
తరలిస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి 8మంది కార్మికులకు షాక్ కొట్టింది. ఈదుర్ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు కరెంట్ షాక్ తగిలి అస్వస్థతకు గురయ్యారు.