
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘మన మిత్ర’ పేరుతో వాట్సప్ గవర్నెన్స్కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ‘మన మిత్ర’ ద్వారా ప్రస్తుతం 200 సేవలు అందిస్తుండగా… ఈ ఏడాది జూన్ 30 నాటికి ఆ సంఖ్యను 500కు పెంచుతామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వంద రోజుల్లో ఏఐ- ఆధారిత వాయిస్ సేవలను ప్రవేశపెట్టాలని కూడా ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు. మరో 100 రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)-ఎనేబుల్ సేవలు, క్యూఆర్ కోడ్ ప్రవేశపెట్టబడుతుందని తెలిపారు.