
మధ్యప్రదేశ్ చింద్వారా జిల్లాలో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 20 వ తేదీ మధ్య దాదాపు 15 రోజుల్లో కిడ్నీ వైఫల్యం కారణంగా 9 మంది మరణించారు. రాజస్థాన్లోని సికార్ జిల్లాలో కూడా ఇలాంటి మరణాలే నమోదయ్యాయి. అయితే వారిలో ఐదుగురు Coldref, మరొకరు Nextro Syrup తీసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే చిన్నారులకు దగ్గు మందును పరిమితంగా వాడాలని డీజీహెచ్ఏ ఆదేశాలు జారీ చేసింది. చిన్నారుల్లో దగ్గు మెడిసిన్ వాడకపోయినా వాటంతట అదే తగ్గతుందని తెలిపింది.