ప్రముఖ ఫుడ్ వ్లాగర్ పవిత్రా కౌర్ .. ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు ఎయిరిండియా బిజినెస్ క్లాస్లో ప్రయాణించగా.. ఈ ప్రయాణంలో తనకు ఎదురైన పరిస్థితులను గుర్తు చేసుకుని.. తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. రూ. 4 లక్షలు పెట్టి.. టికెట్ కొనుగోలు చేసినప్పటికీ.. ఎయిరిండియా విమానంలో సరైన సౌకర్యాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విమానం పరిశుభ్రంగా లేదని పేర్కొన్నారు. అంతేకాకుండా తన సీటుపై చనిపోయిన ఈగలు ఉన్నాయని తెలిపారు. వీటితోపాటు ప్రయాణికులకు పెట్టిన ఆహారం కూడా నాసిరకంగా ఉందని ఆమె మండిపడ్డారు

