
డిజిటల్ ఇండియా.. 2015లో ప్రారంభమైన ఈ కార్యక్రమం గ్రామాల నుండి నగరాల దాకా ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పును తెచ్చింది. డిజిటల్ ఇండియా చేపట్టి 10ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ప్రభుత్వం డిజిటల్ ఇండియా దశాబ్దం-రీల్ పోటీ అనే ప్రత్యేకమైన పోటీని ప్రారంభించింది. ఈ పోటీ జూలై 1న ప్రారంభమవ్వగా.. ఆగస్టు 1 వరకు కొనసాగుతుంది. రీల్ కనీసం 1 నిమిషం నిడివి ఉండాలి. వీడియో ఒరిజినల్గా ఉండాలి. ఇంతకు ముందు ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్లో పోస్ట్ చేయనిదై ఉండాలి