
టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఐపీఎల్ రాణించి టీమిండియాకు ఎంపికైన రింకూ సింగ్ సమాజ్వాదీ పార్టీ ఎంపీగా లోక్సభకు ఎన్నికైన ప్రియా సరోజ్ ల నిశ్చితార్థం జూన్ 8న లక్నోలో ఘనంగా నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు ప్లాన్ చేశాయి. ఎంగేజ్మెంట్ అనంతరం నాలుగు నెలలకు వారణాసిలో నవంబర్ 18న రింకూ సింగ్, ప్రియా సరోజ్ వివాహ బంధంలోకి అడుగుపెడతారు. వారణాసిలోని తాజ్ హోటల్లో వీరి వివాహం జరగనుంది.