రష్యా తాజాగా చేపట్టిన డ్రోన్, మిస్సైల్ దాడుల్లో ఏడు మంది మరణించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డోమిర్ జెలెన్స్కీ తెలిపారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్లోని రెండవ పెద్ద నగరమైన ఖార్కివ్లో ఉన్న కిండర్గార్డెన్పై అటాక్ జరిగింది. వరుస దాడుల వల్ల కీవ్లో కూడా నష్టం జరిగింది. చిన్నారులతో కలిపి సుమారు 26 మంది గాయపడినట్లు జెలెన్స్కీ చెప్పారు. అయితే బుదాపెస్ట్లో పుతిన్తో జరగాల్సిన భేటీని డోనాల్డ్ ట్రంప్ రద్దు చేసుకున్నారు.

