
స్పెయిన్ వేదికగా జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 4 లో భారత మహిళా బృందం పతకాల వేట కొనసాగిస్తోంది. జ్యోతి సురేఖ, పర్నీత్ కౌర్, ప్రీతికా ప్రదీప్ లతో కూడిన త్రయం శనివారం జరిగిన కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో రజతం కొల్లగొట్టింది. పోడియం మీద మువ్వన్నెల జెండాను ఈ ముగ్గురు రెపరెపలాడించగా.. మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ గురి అదరడంతో కాంస్యం కూడా వచ్చి చేరింది.