ఉత్తర్ప్రదేశ్కు చెందిన సూరజ్ భాస్కర్ అనే 20 ఏళ్ల యువకుడు మెడికల్ సీటు కోసం తన కాలును తానే నరుక్కోవడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. నీట్ పరీక్షలో రెండుసార్లు విఫలమవ్వడంతో.. దివ్యాంగుల కోటాలో సీటు దక్కించుకోవచ్చని భావించిన సూరజ్ భాస్కర్.. ఈ దారుణానికి ఒడిగట్టాడు. తొలుత దుండగులు దాడి చేశారని నాటకమాడినా.. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. ఎంబీబీఎస్ కల కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టడం స్థానికంగా కలకలం రేపింది.

