
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం నుండి దసరా కానుకగా మొదటి సింగిల్ ‘మీసాల పిల్ల’ ప్రోమో విడుదలైంది. చిరంజీవి నయనతారను
టీజ్ చేసే సందర్భంలో వచ్చే ఈ పాటను ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ ఆలపించారు. ఇప్పటికే రిలీజైన మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ టీజర్, ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దసరా స్పెషల్ గా లేటెస్ట్ గా ఫస్ట్ సింగిల్ అప్డేట్ అందించారు.