
ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కేసు నిందితులు బెయిల్పై విడుదలవ్వడంపై వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబు వినూత్న శైలిలో స్పందించారు. ఈ విషయంపై ఆయన మంత్రి నారా లోకేశ్ను ట్యాగ్ చేస్తూ తన X (ట్విట్టర్) ఖాతాలో సెటైర్లు వేశారు. ‘నీ లక్ష్యం నెరవేరకుండానే SIT చితికినట్లుంది. జర చూసుకో సూట్ కేసు. అప్పటి పప్పు.. ఇప్పటి సూట్ కేసు’ అంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.