
<span;>తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్న ఎన్ సుమంత్పై ప్రభుత్వం వేటు వేసింది. ఆయనను తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నట్టుగా ప్రభుత్వం పేర్కొంది. అయితే ఎన్ సుమంత్పై పలు ఆరోపణలు రావడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం, అధికారులపై ఒత్తిడికి పాల్పడటం వంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కొండా సురేఖ శాఖలో డిప్యుటేషన్లు, బదిలీలు అంతా సుమంత్ చెప్పినట్టే జరుగుతున్నాయనే ప్రచారం కూడా ఉంది