
ఢిల్లీలోని రోహిణిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో బీహార్కు చెందిన నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు హతమయ్యారు. హాతుల్లో గ్యాంగ్ లీడర్ రంజన్ పాఠక్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో బుధవారం రాత్రి ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ – బీహార్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో మొత్తం నలుగురు గ్యాంగ్స్టర్లు హతమయ్యారు.ఈ నలుగురు నిందితులు బీహార్లో అనేక క్రిమినల్ కేసుల్లో వాంటెడ్ లిస్ట్లో ఉన్నారు. ‘సిగ్మా & కంపెనీ’ పేరుతో చెలరేగుతున్న ఈ ముఠాకు రంజన్ పాఠక్ వహిస్తున్నాడు.