బిహార్లో తొలి విడత పోలింగ్కు రంగం సిద్ధమైంది. ఈనెల 6న 18 జిల్లాల పరిధిలోని 121నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. ఎన్డీయే, మహాగఠ్బంధన్ కూటముల హోరాహోరీ ప్రచారం మంగళవారం సాయంత్రం 5గంటలకు ముగిసింది. ఇరుకూటముల తరఫున అగ్రనేతలు సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ఈ విడతలో RJD అగ్రనేత, మహాగఠ్బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్, ఆయన సోదరుడు తేజ్ప్రతాప్ యాదవ్, బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరీ, జానపద గాయకురాలు మైతిలీ ఠాకూర్ సహా 1,314మంది అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

