అభివృద్ధిలో అందర్నీ భాగస్వాములను చేసే ఉద్దేశ్యంతోనే వన్ ఫ్యామిలీ-వన్ ఆంట్రపెన్యూర్ విధానం తెచ్చామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో వన్ ఫ్యామిలీ-వన్ ఆంట్రపెన్యూర్ విధానంపై జరిగిన చర్చా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలకు మేలు జరగాలి, ఓ తరం అభివృద్ధి చెందాలన్నారు. తన ఆలోచన ఎప్పుడూ ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోణంలోనే ఉంటాయని చంద్రబాబు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉండే టెక్నాలజీలను, పరిణామాలను అందిపుచ్చుకునేలా ఆలోచన చేయాలన్నారు.

