బెంగళూరులో ‘భారత ప్రభుత్వం’ స్టిక్కర్ ఉన్న కారులో కొందరు వ్యక్తులు జేపీ నగర్లోని బ్యాంకు బ్రాంచ్ నుంచి డబ్బు తరలిస్తున్న క్యాష్ వ్యాన్ను వారు అడ్డుకున్నారు. , ఆ డబ్బుకు సంబంధించిన పత్రాలను ధృవీకరించాలని ఆ వ్యక్తులు తెలిపారు. క్యాష్ బాక్సులతోపాటు వ్యాన్ సిబ్బందిని బలవంతంగా తమ కారులోకి ఎక్కించారు. డైరీ సర్కిల్ వైపు వెళ్లారు. అక్కడ సిబ్బందిని కారు నుంచి కిందకు దింపేశారు. బ్యాంకుకు చెందిన సుమారు రూ.7 కోట్ల డబ్బుతో పారిపోయారు.

