
హైదరాబాద్లో జరుగుతున్న పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో గోషామహల్లోని స్టేడియంలో ప్రారంభమైన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 191 మంది పోలీసులు అమరులయ్యారని, వీరిలో తెలంగాణకు చెందిన వారు ఐదుగురు ఉన్నారని, వీరికి సంబంధించిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు ఈనెల 21 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు.