
మారిన రాజకీయ, వాణిజ్య సమీకరణాల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ లకు వైట్ హౌస్ లో ఘనస్వాగతం పలికారు. ఈ పరిణామం ఇరుదేశాల మధ్య సంబంధాలలో కొత్త అధ్యాయానికి సంకేతంగా నిలుస్తోంది. అమెరికా విదేశాంగ మంత్రి మర్కో రూబియో కూడా హాజరైన ఈ సమావేశానికి ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ,పాకిస్తాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్ ఇద్దరూ ‘గొప్ప నాయకులు’ అని కొనియాడారు.