
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన కల్యాణ్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. ఓ గిరిజిన గ్రామంలోని ప్రజలందరికీ పాదరక్షలు పంపించారు. ఈ నెల 7న అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం పెదపాడులో పర్యటించారు. ఈ పర్యటన సమయంలో ఆ గ్రామంలోని గిరిజినులకు పాదరక్షలు కూడా లేవని గ్రహించిన పవన్ కల్యాణ్ చలించిపోయారు. వెంటనే ఉపాధి హామీ సిబ్బందితో చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయ సిబ్బందితో 345 మందికి పాదరక్షలు పంపారు.దీంతో పవన్ కల్యాణ్కు గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు.
- 0 Comments
- AlluriSitaramaraju District