తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు భారీ రాస్తారోకో నిర్వహించారు. పంట కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల, ఇటీవల కురిసిన వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. ఈ నేపథ్యంలో నెల్లికొండ మార్కెట్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కలెక్టర్ వెంటనే స్పందించిన తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

